Home / Tag Archives: telanganacmo (page 169)

Tag Archives: telanganacmo

తెలంగాణలో త్వరలో 2వ విడత గొర్రెల పంపిణీ

తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ త్వరలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి అవసరమైన నిధులను ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. రూ.5 వేల కోట్ల రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే NCDCకి అందించింది. NCDC అధికారి కూడా రాష్ట్రానికి వచ్చి పథకాన్ని పరిశీలించారు. తాజాగా రాష్ట్ర అధికారులు ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు.

Read More »

తెలంగాణకు ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన …

Read More »

పాలేరు నుండి బరిలోకి వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19న నేలకొండపల్లిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో వైఎస్  షర్మిల పాలేరుపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

Read More »

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం  చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వ‌ద్ద ఓ మినీ బ‌స్సు మ‌రో వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 26 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితులంతా ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌వారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బ‌స్సులో అయోధ్య‌, కాశీ సంద‌ర్శ‌న‌కు ఈ నెల 10న …

Read More »

నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మహానగర్ ఎస్టేట్ కాలనీకి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఉన్న పాత డ్రైనేజీ లైన్ ను మార్చి నూతన లైన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు …

Read More »

సుభాష్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే Kp పర్యటన

సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్య లక్ష్మి కాలనీ, జేకే నగర్ లలో చేపట్టిన పట్టణ ప్రగతిలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా రూ.80 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే …

Read More »

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్‌ క్లియర్

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్‌ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …

Read More »

కొడంగ‌ల్, కోస్గి ఆస్ప‌త్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు

తెలంగాణలోని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొడంగ‌ల్, కోస్గి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆరు ద‌శాబ్దాల కాంగ్రెస్ పాల‌న‌లో ఆస్ప‌త్రులు అభివృద్ధి చెంద‌లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు త‌ర్వాత అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు అభివృద్ధి చేస్తున్నామ‌ని, కొడంగ‌ల్, కోస్గి ఆస్ప‌త్రుల్లో మెడిక‌ల్ స‌దుపాయాలు అభివృద్ధి చేశామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆరోగ్య …

Read More »

తెలంగాణలో కొత్తగా 219 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా టెస్టులు చేశారు.. ఇందులో  కొత్తగా  219 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా.. తాజా కేసుల్లో 164 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు

తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్‌కి మాస్‌ క్లాస్‌కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇదే తరహాలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా మంత్రి పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు.తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లిలో పల్లె ప్రగతిలో పాల్గొనడానికి బుధవారం బయలు దేరారు. జనగామ జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat