Home / Tag Archives: telangana (page 188)

Tag Archives: telangana

ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావ‌న కొంద‌రు నేత‌ల్లో ఉన్న క్ర‌మంలో…గులాబీ ద‌ళ‌ప‌తి కొంద‌రు …

Read More »

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌డి..అన్ని పార్టీల్లో కోలాహ‌లం…

తెలంగాణ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఒకింత స్త‌బ్ధుగా ఉన్న రాజకీయ ముఖ చిత్రం 2018 సంవత్సరం ప్రారంభంతో పాటుగా స్థానిక ఎన్నిక‌ల సంద‌డితో హ‌డావుడి మొద‌లైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు గతానికి భిన్నంగా తన కార్యాకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేయబోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ స్థాయిలో తమ కార్యాకలాపాలను కొనసాగించిన ప్రధాన పార్టీలన్నీ భిన్నశైలిలో కార్యకలాపాలను సాగించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ …

Read More »

కాలు దువ్వ‌లేక‌…కామ్ అయిపోయిన కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్‌…

కాంగ్రెస్ రెబ‌ల్ నేత‌లుగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నాయ‌కులు కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు …

Read More »

సంక్రాంతికి కేసీఆర్ చేసిన ప‌నితో అధికారుల్లో ఆశ్చ‌ర్యం…

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌జా సంక్షేమం విష‌యంలో ఎంత‌టి చిత్తశుద్ధితో ఉంటారో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఏకంగా అధికారులు సైతం ఆశ్చ‌ర్య‌పోయిన ప‌రిస్థితి. సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా సందడిగా ఉంటే.. సీఎం కేసీఆర్‌ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.. సంక్రాంతి రోజున నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మంగ‌ళ‌వారం జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సంక్రాంతి రోజున నీటి పారుదల శాఖపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.. …

Read More »

బీసీల సంక్షేమం కోసం….టీ స‌ర్కారు కొత్త నిర్ణ‌యం

తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ చైర్మన్‌గా ప్రభుత్వం …

Read More »

సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల‌కు టీఆర్ఎస్ సర్కారు తీపిక‌బురు…

తెలంగాణ రాష్ట్రంలో కాగజ్‌నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు. …

Read More »

తెలంగాణ అన్న‌దాత‌ల కోసం రూ.15వేల కోట్లు..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్న‌దాతల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తొలిసారిగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌కు కసరత్తు చేస్తున్నది. సుమారు రూ.15 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. రైతుల పెట్టుబడి (విత్తనాలు, ఎరువులు, కొంత మొత్తం కూలీలకు) కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగిలో అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ …

Read More »

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….

తెలంగాణ ప్రభుత్వం మ‌రో తీపి క‌బురు అందించేందుకు సిద్ధ‌మైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …

Read More »

అనుకున్నది సాధించబోతున్న సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికినల్లాల ద్వారా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టును మొత్తం 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించగా ప్రధాన పనుల్లో 90 శాతం పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ (హెచ్‌ఎండీఏ) పైపులైన్ ద్వారా గోదావరి జలాలు (ఎల్లంపల్లి జలాశయం నుంచి) సేకరించి పంపిణీ చేసే జనగామ సెగ్మెంట్‌లో పనులన్నీ పూర్తికాగా, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ పనులు కొన్నిచోట్ల మిగిలాయి. పాలేరు జలాశయం వద్ద …

Read More »

పట్టా పాసు పుస్త‌కాల‌పై సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు…

తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ప్రగతిభవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, పంచాయితీరాజ్ ఎన్నికలు, పంచాయితీల విధులు, మునిసిపల్ చట్ట సవరణ తదితర అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. మార్చి 11వ తేదీ నుంచి పట్టాదార్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat