Home / Tag Archives: telangana (page 17)

Tag Archives: telangana

తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంది.

 స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సంద‌ర్భం ఇది. ఈ చారిత్ర‌క సంబంధాన్ని పుర‌స్క‌రించుకొని స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది. ప్ర‌తి ఇంటికి జాతీయ జెండాల‌ను ఉచితంగా …

Read More »

రేపు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లో ట్రాఫిక్ బంద్.. ఎందుకంటే..?

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా  సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసుశాఖ ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు …

Read More »

‘ఫ్రీడం రన్‘ను ప్రారంభించి 2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కొంపల్లిలో చేపట్టిన ‘ఫ్రీడం రన్‘ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి జంక్షన్ నుండి పేట్ బషీరాబాద్ వరకు నిర్వహించిన 2K రన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ వివిఎస్ …

Read More »

తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ

భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ …

Read More »

స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలి

అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ‌, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త

గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా  శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …

Read More »

కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి  ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …

Read More »

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల  రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్‌ చరాస్తుల …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మదాపూర్‌, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పర్‌, బండ్లగూడ జాగీర్‌ ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అత్తాపూర్‌, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుండగా.. వాహనాలు ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, కొంపల్లి భారీ …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ!

ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పెంపుకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సి ఉన్నందున సీట్ల సంఖ్య పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగి ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat