టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి బ్రెండన్ టేలర్ గుడ్ బై
జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్.. ఆ తర్వాత జింబాబ్వే స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ 20లు ఆడాడు. వన్డేల్లో జింబాబ్వే తరపున 6,677 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున ఇదే రెండో అత్యధికం.
Read More »భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా
భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా పడింది. టెస్టు మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు శిక్షణ సిబ్బందికి కరోనా సోకడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాకే మ్యాచ్పై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
Read More »టీమ్ఇండియా మరో అద్భుత విజయం
పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్మెన్ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమ్ఇండియా 2-1తో …
Read More »76 పరుగుల తేడాతో భారత్ ఓటమి
లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో …
Read More »క్రిస్టియానో రొనాల్డో కి ఏడాదికి రూ. 253 కోట్లు
పోర్చుగీసు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు తిరిగి వెళ్లాడు. ఇప్పటి దాకా యువెంటస్ తరఫున ఆడిన రొనాల్డోకు ఇకనుంచి ఏడాదికి రూ. 253 కోట్లు (వారానికి రూ. 4.85 కోట్లు) చెల్లించేలా మాంచెస్టర్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రొనాల్డో మాంచెస్టర్ తరఫున అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ క్లబ్ తరఫున అత్యధికంగా డేవిడ్ డి గియా ఏడాదికి రూ. 197 …
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధవారం హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్కు కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతోమంది యువతలో స్ఫూర్తి …
Read More »ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచలనాలకు తెరపడింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్లో ఇండియాకు వచ్చిన …
Read More »