దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. 40 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్-23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ. 20వేల మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే కరోనా కారణంగా గత సీజనక్కు గానూ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇస్తున్నట్లు చెప్పారు.
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్
డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »అంతర్జాతీయ క్రికెట్ కి బ్రెండన్ టేలర్ గుడ్ బై
జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004లో అరంగేట్రం చేసిన బ్రెండన్ టేలర్.. ఆ తర్వాత జింబాబ్వే స్టార్ బ్యాట్స్మన్గా ఎదిగాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ 20లు ఆడాడు. వన్డేల్లో జింబాబ్వే తరపున 6,677 పరుగులు చేశాడు. జింబాబ్వే తరపున ఇదే రెండో అత్యధికం.
Read More »భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా
భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా పడింది. టెస్టు మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు శిక్షణ సిబ్బందికి కరోనా సోకడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాకే మ్యాచ్పై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
Read More »టీమ్ఇండియా మరో అద్భుత విజయం
పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్మెన్ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమ్ఇండియా 2-1తో …
Read More »76 పరుగుల తేడాతో భారత్ ఓటమి
లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో …
Read More »క్రిస్టియానో రొనాల్డో కి ఏడాదికి రూ. 253 కోట్లు
పోర్చుగీసు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు తిరిగి వెళ్లాడు. ఇప్పటి దాకా యువెంటస్ తరఫున ఆడిన రొనాల్డోకు ఇకనుంచి ఏడాదికి రూ. 253 కోట్లు (వారానికి రూ. 4.85 కోట్లు) చెల్లించేలా మాంచెస్టర్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రొనాల్డో మాంచెస్టర్ తరఫున అత్యధిక పారితోషికం అందుకోనున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ క్లబ్ తరఫున అత్యధికంగా డేవిడ్ డి గియా ఏడాదికి రూ. 197 …
Read More »