దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »ఎంపీగా పిటీ ఉష ప్రమాణం
ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష ఈ రోజు బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం ఇక్కడ విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ వీ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత రామ్నాథ్ కోవింద్ కు ఏమి ఏమిస్తారో తెలుసా..?
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 24న ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తన ఇంటి సామాను 12 జన్పథ్ బంగ్లాకు తరలించాలని …
Read More »వీలుచైరులో వచ్చి మరి ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలయింది. సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగనున్నది.ఈ ఎన్నికల్లో భాగంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీలుచైరులో వచ్చి మరి పార్లమెంట్ లో తన ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత …
Read More »పన్నీరు సెల్వానికి మరో షాక్
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ రాష్ట్ర మాజీ సీఎం పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. ఆయన ముగ్గురు కుమారులు సహా 16 మంది అనుచరులపై తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వేటు వేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరిస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్రమంగా పన్నీరుసెల్వం వర్గాన్ని పార్టీ నుంచి పూర్తిగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read More »ఆ 4గురికి రాజ్యసభ
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో కేంద్రం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష ఉన్నారు. వీరితోపాటు ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెర్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ వరుస …
Read More »మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం
మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.
Read More »వంట గ్యాస్ సిలిండర్ పై సామాన్యులకు షాక్
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో రూ.1055గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగింది. అయితే …
Read More »సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం
మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్నాథ్ షిండే తొలిసారి థానేలోని తన నివాసానికి వెళ్ళిన ఆయనకు గ్రాండ్గా వెల్కమ్ దక్కింది. డ్రమ్స్తో ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆయన భార్య లతా ఏక్నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్తకు వెల్కమ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్నాథ్ వస్తున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బ్యాండ్ను సెటప్ చేశారు. ఈ సందర్భంగా ఏక్నాథ్ సతీమణి లతా కూడా బ్యాండ్ …
Read More »కేరళ సీఎం ను తుపాకీతో కాల్చేస్తా-మాజీ ఎమ్మెల్యే సతీమణి ఉషా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేయడం వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది. అందుకే ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. …
Read More »