ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్లో ప్రసంగం చేయడానికి జెలెన్స్కీకి ఆహ్వానం వచ్చింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల జెలెన్స్కీతో టచ్లో ఉన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సేనేట్లో ఉన్న సభ్యులందరితో జెలెన్స్కీ మాట్లాడనున్నారు. ఉక్రెయిన్కు చెందిన అంబాసిడర్ ఒక్సానా మర్కరోవా …
Read More »ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన
రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.
Read More »రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.
Read More »ఉక్రెయిన్ యుద్ధం-6000 మంది రష్యన్లు మృతి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.
Read More »Shocking News-ఉక్రెయిన్ లో బిల్డింగ్స్ పై గుర్తులు..! అసలు ఆ గుర్తులు ఏంటి..?
ఉక్రెయిన్ విషయంలో రష్యా రోజురోజుకీ మరీ పాశవికంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును రష్యన్ పౌరులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ టార్గెట్గా రష్యా బలగాలు ముందుకు కదిలితే.. తాజాగా… పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నాయి. పౌరులు నివసించే నివాస ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్తలను చూస్తే ఒళ్లు గగుర్పుట్టడం ఖాయం. ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలపై …
Read More »రష్యా కు షాక్ – ఐరాస సంచలన నిర్ణయం
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. భద్రతామండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.
Read More »ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్యకు 400 మంది కిరాయి గుండాలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.
Read More »ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర
ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్ స్కీతోపాటు.. ఉక్రెయిన్ ప్రధాని, ఆయన కేబినెట్లోని మంత్రులు, కీవ్ మేయర్, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్ చాంపియన్లు).. ఇలా 23 …
Read More »అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇండియాతో ఉక్రెయిన్..?
1998లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ హయాంలో జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అణు పరీక్షలను నిలిపివేసి, అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయాలంటూ ఐరాస భద్రతామండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థించింది. భారత విజ్ఞప్తిని పక్కనబెట్టి 2017లో పాకిస్తాన్కు 330 T80D యుద్ధ ట్యాంకులను విక్రయించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి విషయంలోనూ పాక్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వేళ మన దేశ సాయం …
Read More »