ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »అదానీ స్టాక్స్ మోసాలపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్స స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా …
Read More »జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్లోని మినిస్టర్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్ మాల్ …
Read More »వరంగల్ లో ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ
తెలంగాణ రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్లో తన డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించా రు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను ఆ …
Read More »కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్లు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అసెంబ్లీలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి …
Read More »ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »తెలంగాణ ఐపీఎస్ లు బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్గా నియమిస్తూ ప్రభుత్వం …
Read More »తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా …
Read More »