తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9,123 స్కూళ్లకు వీటికి ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. బషీర్బాగ్లోని సమగ్రశిక్ష అభియాన్ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి వాటర్ జెట్ క్లీనింగ్ యంత్రాలను పరిశీలించారు. అధికారుల వివరణపై సంతృప్తి చెందిన కేటీఆర్.. రాష్ట్రంలోని అన్ని …
Read More »అభివృద్ధి, సంక్షేమాలే మా నినాదాలు….మా విధానాలు……
తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల …
Read More »విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగియనుండగా తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబిత స్పష్టం చేశారు. సెలవులు పొడిగించాలా? విద్యాసంస్థలను తెరవాలా అనేది ఈ నెల 30 నాటి కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 8, ఆ పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు …
Read More »తెలంగాణలోని సర్కారు బడులకు మహర్ద
తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …
Read More »తెలంగాణలో Inter ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో Good News
తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. రీవాల్యూ యేషన్, రీకౌంటింగ్ కోసం అప్లై చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు చెల్లించిన ఫీజు తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి తమ కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా నగదు తీసుకోవచ్చని తెలిపింది.
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్ టెక్స్టైల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్లోని తాజ్ కృష్ణ్ణ హోటల్లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కిటెక్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …
Read More »ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More »పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయడం, పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా విజయ మెగా డెయిరీని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా నిర్మాణం పూర్తిచేస్తామని, మెగా డెయిరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో …
Read More »విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్ సందర్భంగా స్కూల్ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి …
Read More »తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరిత్రలో ఫస్టియర్లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »