Home / Tag Archives: padayatra (page 42)

Tag Archives: padayatra

వేంపల్లి నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం… భారీగా జనం

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం వేంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు. వేంపల్లి క్రాస్‌ రోడ్డు, వైఎస్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, …

Read More »

కొడాలి నాని టీడీపీకి దిమ్మతిరిగే పంచ్ డైలాగ్ లు

గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ పంచ్ డైలాగ్ లు వాడారు. ఇడుపుల పాయలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ పాదయాత్రను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.ఇదే తరుణంలో ఆయన ఒక డైలాగ్ వేశారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. అని ఆయన …

Read More »

జ‌గ‌న్‌.. త‌న‌కి అనుకూలంగా మార్చుకునేనా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!

వైసీపీ అధినేత జగన్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇకపోతే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …

Read More »

నేను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో నాపోటో పెట్టుకునేంత మంచి చేస్తా…జగన్

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …

Read More »

జ‌గ‌న్‌లో ఉన్నమ‌రో కోణం బ‌య‌ట ప‌డిందిగా..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జ‌గ‌న్ తొలిరోజు పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో చాలా క‌సితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …

Read More »

చంద్ర‌బాబుకు.. జ‌గ‌న్ బ్లాస్టింగ్ స‌వాల్..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్రను అశేష జ‌న‌సంద్రం మ‌ధ్య ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ తొలిరోజు.. తొలి ప్ర‌సంగాన్ని క‌సితో ప్రారంభించారు. వైయ‌స్సార్ జిల్లాలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అరాచ‌కాల పై ద్వ‌జ‌మెత్తారు. అత్యంత ఆశ‌క్తిగా సాగిన ప్ర‌సంగంలో.. జ‌గ‌న్ చంద్ర‌బాబుకు బ్లాస్టిగ్ స‌వాల్‌ను విసిరారు. ఇటీవ‌ల నంద్యాలలో జ‌రిగిన‌ ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …

Read More »

‘జగన్ పాదయాత్ర కోసం పూలను పరిచిన మహిళలోకం

ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన …

Read More »

చంద్ర‌బాబు చేసిన ఏకైక మంచి ప‌నిని మెచ్చుకున్న‌ జ‌గ‌న్..!

ఏపీ రాజ‌కీయాల‌ను శాసించిన దివంగ‌త మహానేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ బాట‌లో త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను.. ద‌గ్గ‌రుండి తానే స్వ‌యంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జ‌గ‌న్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొద‌ట‌గా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జ‌గ‌న్ కుటుంబసభ్యులతో కలిసి.. …

Read More »

జ‌గ‌న్ స్పీచ్ నుండి పేలిన‌ హైలెట్ డైలాగ్..!

ఏపీ ప్ర‌జ‌ల కోసం వైసీపీ అధినే జ‌గ‌న్ మోమ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6న అంటే సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర గ్రాండ్‌గా ప్రారంభిచారు. మొదట వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జగన్‌.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర సంద‌ర్భంగా నిర్వ‌హించిన బహిరంగ సభలో జ‌గ‌న్‌ అద‌రిపోయే ప్ర‌సంగం చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat