బీహార్కు చెందిన పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖకు చెందిన సుమారు 25 మంది సభ్యులు మంత్రి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి.తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More »TSRTC ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Read More »పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …
Read More »పక్కా స్కెచ్ తో ముందుకెళ్తున్న జగన్, ఏజెంట్లకు విజయవాడలో శిక్షణ కార్యక్రమం
హైదరాబాద్ లోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి తరలించారు.. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపి ఆఫీస్ నుండి ఫర్నిచర్ ను, ఫైళ్లను అమరావతిలోని తాడేపల్లి వైసీపి కార్యాలయానికి సిబ్బంది తరలించారు. తాడేపల్లిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్న వైసీపీ అధినేత అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే ఈ నెల 16న వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే కౌంటింగ్ ఏజెంట్ల కు విజయవాడలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది పార్టీ.. …
Read More »తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి తాళంపడింది.. అమరావతిలో ఆఫీస్ కు కూడా టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం
తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి ఇప్పటికే తాళం పడిందని, అమరావతిలోని టీడీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని వైసీపీ నేత రెహమాన్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నోవిధాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మరో సంచలనం
సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి భారతదేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో సమావేశమై ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …
Read More »రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్లోని రేవంత్ నివాసానికి ఐటీ బృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు …
Read More »రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్కుమార్తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More »టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్
టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …
Read More »