కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …
Read More »సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మళ్లీ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ..!
ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా …
Read More »ఏపీ అటవీ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!
అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కంపా నిధులు రూ.323 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. కేంద్ర చట్టాల మేరకు 33 శాతం పచ్చదనం ఉండాలని అన్నారు. అయితే రాష్ట్రంలో పచ్చదనం …
Read More »ఇంటర్ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ & డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఇంటర్మీడియట్ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18-30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్ఎస్ సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆర్హత ఉన్నవారు వచ్చే నెల …
Read More »సచివాలయ పరీక్షల్లో పాస్ అవ్వలేదని భాదపడుతున్నారు…మీకో గుడ్ న్యూస్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్క్ పరిపాలన చూపించారు. సాధారణంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన ఉద్యోగాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు పట్టుమని ఒక పదివేలు జాబులు తీసిన పాపాన పోలేదు. చాలా వాటికి నోటిఫికేషన్ కి కూడా ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన …
Read More »ఆయుష్ కన్వీనర్ కోటా సీట్లకు 6,7న కౌన్సెలింగ్.. కేహెచ్యూ నోటిఫికేషన్ విడుదల…!
వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను నెల 6 , 7 న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనునన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు కేహెచ్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తొలి విడుత వెబ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ఎంఎ్స), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్వైసీ) కోర్సుల్లో కేటగిరి-ఏ సీట్లను భర్తీ చేయనున్నారు. …
Read More »జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ విడుదల…!
జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నెంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్ను …
Read More »గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నోటిఫికేష్ విడుదల….!
దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్షిప్స్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …
Read More »