ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్లో రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో …
Read More »పెళ్లి రోజే భర్తను వదిలేసి ప్రియుడితో జంప్!
విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో సూపర్ ట్విస్ట్. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి …
Read More »ఆత్మకూరు బైపోల్.. వైసీపీకి తిరుగులేని విజయం
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్కుమార్ యాదవ్పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …
Read More »ఇంతకీ పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామన్న పవన్… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కోటంరెడ్డి అరుంధతి వాడలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు కోటంరెడ్డిని నెల్లూరు అపోలో హాస్పిటల్లో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత చెన్నై హాస్పిటల్కి …
Read More »గౌతమ్రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …
Read More »అనిల్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్తో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. అనిల్ యాదవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య …
Read More »గౌతమ్రెడ్డితో ఫ్రెండ్షిప్ వల్లే అది సాధ్యమైంది: జగన్
మేకపాటి గౌతమ్రెడ్డి లేని లోటును భర్తీ చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్రెడ్డి తనకు అండగా …
Read More »లవ్ చేయలేదని కాలేజ్స్టూడెంట్ గొంతుకోసిన ఆటోడ్రైవర్
నెల్లూరు: ఎన్నాళ్లు వెంటపడుతున్నా ప్రేమించడం లేదని ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్ గొంతు కోసేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన ఓ విద్యార్థిని (17 సంవత్సరాలు) ఇంటర్ చదువుతుంది. ఆ ఏరియాకే చెందిన ఆటో డ్రైవర్ కృష్ణ ప్రేమ పేరుతో విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. దీంతో …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన జగన్ !
ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమనరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు ప్రాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడు. గాంధీజీ భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుడి జయంతి సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, …
Read More »