Home / Tag Archives: narender modi (page 30)

Tag Archives: narender modi

హైదరాబాద్ లో మళ్లీ దొరికిన రూ.89.92 లక్షల నగదు- ఆ అభ్యర్థివేనా..?

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ఉన్న సంగతి విదితమే. ఈ పోలింగ్ రోజు  సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ …

Read More »

పార్టీ మార్పు పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపీ ధర్మపురి అరవింద్ తో సహా పలువురు నేతలు గత కొన్ని రోజులుగా మీడియా సమావేశాల్లో పలు మార్పు చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,బీరం హర్షవర్ధన్ రెడ్డి,రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ …

Read More »

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్

నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఖాతాల్లోకి తన కుటుంబానికి చెందిన సుశీఇన్ ఫ్రా కంపెనీ నుండి జరిగిన దాదాపు రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులను …

Read More »

సీఎం కేసీఆర్ ఉచ్చులో బీజేపీ

డామిట్…కథ అడ్డం తిరిగింది! ఎనిమిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాల కుత్తుకలు కోస్తూ విజయగర్వంతో మీసాలు మెలేస్తూ వస్తున్న బీజేపీకి తెలంగాణాలో కేసీఆర్ శ్మశ్రుతిరుక్షవరం గావించి పేడిమూతితో సమాజం ముందు నిలబెట్టారు! తమ విశృంఖలత్వానికి మొయినాబాద్ ముకుతాడు వేస్తుందని ఏమాత్రం ఊహించని బీజేపీ అధినాయకత్వం ఒక్కసారిగా చేష్టలుడిగిపోయింది. ఏమి చెప్పాలో తెలియక యాదాద్రి, వేదాద్రి అంటూ డ్రామాలు ఆడుతూ గంగవెర్రులెత్తిపోతున్నది. యాదాద్రి ప్రమాణాలను రాజ్యాంగం, చట్టం అంగీకరించవు. కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్‌ అభినవ అంబేద్కర్‌

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  సంస్థాన్‌ నారాయణపురంలో బీఆర్‌ అంబేద్కర్‌ మాల యువజన సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహుజన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్ …

Read More »

ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు

ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం  కొనుగోలు వ్యవహారం. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. …

Read More »

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం  అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం  కొనుగోలు వ్యవహారం. ఈ అంశాన్ని  బట్టబయలు చేసిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే  పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ …

Read More »

కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా …

Read More »

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఈ రోజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ   ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఖర్గే బుధవారం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రామ్‌లకు …

Read More »

అత్యధిక గొర్రెలు తెలంగాణలోనే..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో … ముఖ్యమంత్రి  కేసీఆర్‌ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అర్హులైన గొల్ల కురుమలందరికీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat