తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం …
Read More »వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం
తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్
దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …
Read More »స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ …
Read More »గుజరాత్ లో గెలిచిన ఏకైక ముస్లీం ఎమ్మెల్యే అతనోక్కడే..?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్థులే. కానీ ఈసారి కేవలం ఇమ్రాన్ ఒక్కరే విజయం సాధించారు. అహ్మదాబాద్ సిటీలోని జమాల్పుర్-ఖేడియా అసెంబ్లీ నియోజకవర్గం …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …
Read More »బాసర త్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు …
Read More »బీఆర్ఎస్ లోకి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనుమడు !
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన, అధినేత సిఎం కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాల్లో వో సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బిఆర్ఎస్ పార్టీ గుణాత్మక జాతీయ విధానాలు, ఇప్పటికే పలువురు రాజకీయ వేత్తలను, మేథావులను ఆకర్షిస్తున్నవి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో పలువురు సీనియర్ రాజకీయ నేతలు మేథావులు ప్రజాక్షేత్రంలో …
Read More »