ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …
Read More »