నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »హైదరాబాద్ ప్రజలకు ఇది శుభకార్యం..కేసీఆర్కు రుణపడి ఉంటాం: కేటీఆర్
ఓఆర్ఆర్ మాత్రమే కాదని.. ఆర్ఆర్ఆర్ వచ్చినా అక్కడి వరకు నీళ్లు అందించేలా సుంకిశాల ప్రాజెక్టు డిజైన్ రూపొందించామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద ఇన్టేక్వెల్ ప్రాజెక్టుకు మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్ తదితరులతో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన …
Read More »త్రిపురారం మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే భగత్ విస్తృతస్థాయి సమావేశం
హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రిపురారం మండల ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమంలో స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కమిటీల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి గారు.. త్రిపురారం మండలం,నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్ష, కార్యదర్శుల నియామకాల గురించి, మండల కమిటీ ఎన్నికల నియామకాల గురించి మండల నాయకులతో విధివిధానాలు తెలుసుకుని మండల కమిటీల గురించి చర్చిచి మండల అధ్యక్షుల, కార్యదర్శులను …
Read More »మాజీ మంత్రి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియాలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా జానారెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు. 2 ఏండ్లలో కరెంట్ వ్యవస్థను మంచిగా చేసి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పితే జానారెడ్డి ఎగతాళి చేసిండు. రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి …
Read More »హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్
నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ సాగర్ పర్యటనకు బయల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. హాలియా మార్కెట్యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో లిఫ్ట్ పథకాల పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నెల్లికల్, ఇతర …
Read More »శ్రీశైలం నుంచి నీటి విడుదల … 2007 తర్వాత ఇదే మొదటిసారి …
శ్రీశైలం జలాశయం నుంచి నేడు నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జలాశయం గేట్లను పైకెత్తి సాగర్కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. 2007 తర్వాత జులైలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ …
Read More »సాగర్ ఆప్డేట్ – 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్కు 9,106 ఓట్ల ఆధిక్యం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశగా దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. పదకొండో రౌండ్ ముగిసే సరికి 9,106 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ …
Read More »సాగర్ ఎగ్జిట్పోల్స్- టీఆర్ఎస్దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. టీఆర్ఎస్ – 50.48%, కాంగ్రెస్ …
Read More »మాజీ మంత్రి జానారెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణలో రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మృతితో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన …
Read More »జానారెడ్డి గెలుపు పై ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న సీనియర్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గెలుపు పై మాజీ మంత్రి,భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంబర్ పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ” నాజీవితం కాంగ్రెస్ పార్టీకే అంకితం. …
Read More »