తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి అధికంగా ఉంటున్నది. దీంతో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమ్రం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లాలో …
Read More »పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్
తెలంగాణలో పోలీస్ సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తూ ఫిజికల్ టెస్ట్కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని సూచించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాలు, …
Read More »పోలీస్ కస్టడీకి నందకూమార్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై …
Read More »రైతు సంక్షేమ పథకాలను తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే Kp…
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు …
Read More »మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read More »కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
కోదాడ మున్సిపాలిటీని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.సోమవారం కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రూ.80లక్షలతో, 28వ వార్డులో రూ.54లక్షల వ్యయంతో రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 7వ వార్డుల బాలాజీ నగర్ లోని కోటి 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామమును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. …
Read More »ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవబలం తోడయింది- వినోద్ కుమార్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్కు కనీసం డిపాజిట్ వస్తే తాను …
Read More »