తెలుగు సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీ అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే వార్తలు వస్తుండగా.. ఒక హీరోయిన్ పూజా హెగ్దే పేరు ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్వీకపూర్ పేరు తెరపైకి రాగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.. తెలుగులో మరో క్రేజీ ఆఫర్ను కొట్టేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’కు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. కొరటాల గత చిత్రాలకు DSP సంగీతమందించాడు.
Read More »మధుప్రియకు తప్పని వేధింపులు
తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సింగర్ మధుప్రియ ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
Read More »మెగా పవర్ స్టార్ తో త్రివిక్రమ్ భారీ ప్రాజెక్టు
మహేష్ బాబుతో మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తేజ్తో సినిమా చేసేందుకు స్క్రిప్టును సిద్ధం చేశాడట. ప్రస్తుతం ‘RRR’లో నటిస్తున్న మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత శంకర్ మూవీలో కన్పిస్తాడు. ఆ తర్వాతే వీరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Read More »4రోజులు నిద్రపోని హాట్ బ్యూటీ..ఎందుకంటే..?
గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read More »పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ సినిమాకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పవన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇందులో ఐబీ ఆఫీసర్గా, లెక్చరర్గా పవన్ నటించనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read More »టైం గ్యాపంతే…టైమింగ్ లో కాదంటున్న రీతూ
పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్తోపాటు కోలీవుడ్లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్థింగ్ స్పెషల్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. …
Read More »OTTలో బిగ్ బాస్’ ఫేమ్ దివ్య నటించిన క్యాబ్ స్టోరీస్
బిగ్ బాస్’ ఫేమ్ దివ్యా వడ్త్య, గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. ఈ నెల 28న స్పార్క్ ఓటీటీలో విడుదల కానుంది. టీజర్ను సునీల్, ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుందని దర్శక-నిర్మాతలు కె.వి.ఎన్. రాజేశ్,
Read More »సమంత గొప్ప మనస్సు
ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్టర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్టర్లను అందజేశారు. వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆసుపత్రికి అప్పగించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి ప్రయివేట్ వ్యక్తుల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Read More »సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్
‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో నటించనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ నిర్మించాడు. ఈ మూవీలో పవన్ లెక్చరర్ పాత్రలో కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కాలేజీలోనే ఉండటంతో సెట్ వేశారట.
Read More »