తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »PV కి భారతరత్న ఇవ్వాలి-మంత్రి తలసాని
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు 101 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీని కేంద్రం విస్మరించడం …
Read More »ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులు అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్, టీఎస్ఎస్ పిడిసీఎల్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులలో భాగంగా అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు బదిలీ చేసి, రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేపట్టి పూర్తి …
Read More »తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్తో కలిపి మొత్తం 9,07,393 మంది …
Read More »తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో బోధన చేశాం. గతేడాది 70 …
Read More »BJPకి TRS షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై గత ఎనిమిదేండ్లుగా …
Read More »సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ ఓపెన్ లాండ్ కు అనుకోని ఉన్న దేవమ్మ బస్తీ మహంకాళి టెంపుల్ నుండి గ్రేవియార్డు వరకు సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ గారి ఆధ్వర్యంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. …
Read More »గజ్వేల్కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్ పాయింట్కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్ రైలులో 11 మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నాయని …
Read More »తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Read More »సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష
అమెరికాలోని మేరీల్యాండ్లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …
Read More »