ఐనవోలు మండలం లో ముస్లిం సోదరులకు క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐనవోలు మండల ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే గారు పంపిణి చేశారు. ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహలతో రంజాన్ పండుగ …
Read More »బండి సంజయ్ కు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సంజయ్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది. నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బండి దాఖలు …
Read More »సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటివరకూ 1131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అధికారులు వివరించారు.
Read More »రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయం
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు . నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ధాన్యం కొనుగోలు జరగలేదని, కేసీఆర్ సీఎం అయ్యాకే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వేల …
Read More »అర్హులైన పేదలకు తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు. ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు …
Read More »అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని రింగ్ బస్తీలో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద రూ.20 లక్షల సీడీపీ నిధులతో నూతనంగా చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్సీ మధుసూధనా చారి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ శుభకార్యాలకు ప్రజలకు ఎంతో …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘కు అపూర్వ ఆదరణ…
‘ప్రగతి యాత్ర‘ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 50వ రోజు పర్యటించారు. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గడిచిన ఏళ్లలో కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ‘ప్రగతి యాత్ర‘కు ప్రజల నుండి రోజు రోజుకు …
Read More »ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ గార్డెన్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ విందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ …
Read More »టీకాంగ్రెస్ లో వర్గపోరు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో అసలు కాంగ్రెస్దే పైచేయిగా నిలిచింది.ఉత్తమ్, రేవంత్ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో …
Read More »మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉదృతమౌతున్నది.నిన్న బుధవారం నాడు బీఆర్ఎస్ అధినేత .. సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి ప్రముఖ కీలక నేతలు పలువురు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్ సి పి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్ సి పి పార్టీ …
Read More »