తెలంగాణలో దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు కార్యాచరణ దేశంలో ఇప్పటికే వో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్న …
Read More »కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలారా..! ఈ ఎన్నికల్లో ద్వేషాన్ని తిరస్కరించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజల, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాలని ఆమె తన ట్వీట్లో కోరారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. …
Read More »యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి కేటీఆర్ వివరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. గతేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ …
Read More »‘ప్రగతి యాత్ర‘లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 54వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ కే లేఔట్, మిథిలా నగర్ కాలనీల్లో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. మొదటగా ఆర్ కే లేఔట్ లో రూ.1.85 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు, సుమారు రూ.2 కోట్లతో వాటర్ లైన్ పనులు, రూ.1.95 కోట్లతో 5 పార్క్ ల …
Read More »ఊర్స్ షరీఫ్ ముబరక్ వేడుకలలో ఎమ్మెల్యే కేపి వివేకానంద
కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ గారితో కలిసి బాచుపల్లి జీతేపీర్ దర్గా నందు ఊర్స్ షరీఫ్ ముబరక్ వేడుకలలో భాగంగా ముస్లిమ్ సోదరులతో కలిసి మీనా బజార్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ గారు, విజయ …
Read More »తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల…
తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 86.60 శాతం ఉత్తీర్ణత… బాలికలు 88.53 శాతం… బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత… 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత… 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు… 99 శాతంతో ప్రథమ …
Read More »నేడే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో పది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4 లక్షల 86వేల 194 మంది దరఖాస్తు చేసుకోగా.. 4 లక్షల 84 వేల 384 మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం …
Read More »సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో 2.2 లక్షల …
Read More »ఈ నెల 9న ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఈ నెల 9వ తేదీన మంగళవారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ …
Read More »మహరాష్ట్రలో బీఆర్ఎస్ సంచలనం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మహరాష్ట్రలో రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. ఈ క్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్ఎస్లో విలీనమైంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సంఘటన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్తోపాటు నేతలు కిరణ్ వాబ్లే, అవినాశ్ దేశ్ముఖ్, అశోక్ అందాలే, …
Read More »