తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లు ఎందుకు వాటిని అమలు చేయలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా కోనాపూర్లో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ‘ మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో స్కూల్ …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా?: కేటీఆర్ ఎద్దేవా
సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తారా? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ సభలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదివారని ఎద్దేవా చేశారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. పొత్తు కావాలని ఆ పార్టీని ఎవరైనా …
Read More »‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత
వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్రావు, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More »గూగుల్తో ఒప్పందం.. మరింత మెరుగైన సేవలకు అవకాశం: కేటీఆర్
అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్కు గూగుల్ సంస్థ శ్రీకారం చుట్టింది. అమెరికాలోని మౌంటెన్వ్యూలోని తమ హెడ్క్వార్టర్ తర్వాత హైదరాబాద్లో 3.3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను స్థాపించనుంది. ఈ క్యాంపస్కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. విద్య, పౌరసేవలతో పాటు ఇతర రంగాల్లో గూగుల్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్ …
Read More »మొదటి 20లో 19 తెలంగాణ గ్రామాలే.. కంగ్రాట్స్ సీఎం గారూ: కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …
Read More »దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ చేసి చూపించారు: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More »కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్జీ గ్యాస్ లైన్ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More »మేం వద్దంటున్నామా? దమ్ముంటే అమలు చేయండి: బీజేపీపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వాటిని అమలు చేస్తామంటే తాము వద్దంటామా? అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేటీఆర్సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం …
Read More »మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …
Read More »