నిండా పదేండ్లు కూడా నిండని తెలంగాణ దేశంలో ఏండ్లకొద్దీ ఆర్థికంగా పటిష్టంగా నిలిచిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలను అధిగమిస్తూ టాప్ ర్యాంకునకు దూసుకుపోతున్నది. రంగం ఏదైనా, పోటీలో ఆర్థికంగా స్థిరత్వం కలిగి అన్ని రకాల వనరులున్న రాష్ట్రాలున్నా వాటిని తలదన్నుతూ ముందుకు సాగుతున్నది. తలసరి ఆదాయం, ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయం, వాణిజ్యం, ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, 24 గంటల కరెంట్తో పాటు కేంద్ర ఆర్థిక గణాంక శాఖ …
Read More »సిండికేట్ లు ఏర్పడకుండా చర్యలు
తెలంగాణలో కొత్తగా మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో సిండికేట్ లు ఏర్పడకుండా మద్యం దుకాణాల కేటాయింపునకై ధరఖాస్తులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణాని కైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసామని దాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల …
Read More »కళ్లు లేని కబోదిలా బీజేపీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్కాన్ పెట్టుబడి …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఖానాపూర్ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షిస్తులై పార్టీలో ప్రజలు నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకెళ్లి తెలంగాణ …
Read More »మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనను ఖండిస్తూ సూరారం మెయిన్ రోడ్ నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు క్రైస్తవ, ముస్లిం, హిందూ సోదరులు మరియు మానవతవాదులు నిరసన తెలుపుతూ నిర్వహించిన శాంతి ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పాల్గొని సంగిభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాలు మతాలు అతీతంగా బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చుకున్నా భారతదేశం నేడు కుల మాత బేదాభిప్రాయాలతో …
Read More »గాజులరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే కెపీ
తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని గర్జన రామారం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్ స్టోన్ ది రూఫ్ టాప్ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు …
Read More »గ్రూప్ -2 పరీక్షపై బిగ్ అలెర్ట్
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న గ్రూప్ – 2 పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ఊరటనిచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. టీఎస్పీఎస్సీతో చర్చించి అనువైన తారీఖును నిర్ణయించి మళ్లీ గ్రూప్ -2 పరీక్ష ను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎస్పీఎస్సీ …
Read More »సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 19 , 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మెదక్ ,సూర్యాపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ముందుగా ఈనెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా …
Read More »