ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కోల్కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు …
Read More »రిపబ్లిక్ టీవీ సర్వే… పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్కు 16, వైసీపీకి 14 సీట్లు..!!
మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికల్లో కుడా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతుంది.ఈ నేపధ్యంలోనే జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఒక సర్వే చేసింది.ఏపీలో ఈ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 14 చోట్ల విజయం …
Read More »ఉగాది నుంచే నిరుద్యోగ భృతి..!!
ఎన్నికల ప్రచార మేనిఫెస్టో లో భాగంగా ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి..దీనికి మార్గదర్శకాలు ఏమిటి.. లబ్ధిదారులను ఎలా గుర్తించాలనే అంశాలకు …
Read More »కేసీఆర్ మాటకే జై కొట్టిన లోక్ సత్తా జేపీ
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే గులాబీ దళపతి మాటకు లోక్సత్తా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ జైకొట్టారు. ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు …
Read More »ఆంధ్రాలో కేసీఆర్కు భారీ స్వాగతం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈరోజు మరోసారి రుజువు అయింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ లోని విశాఖపట్నం శారదా పీఠాన్ని సందర్శించనున్న క్రమంలో పీఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రం …
Read More »తాతకు తగ్గ మనుమడు…హిమాన్షు కీలక నిర్ణయం
తాతకు తగ్గ మనమడు….తండ్రి గొప్ప మనసుకు తగిన వారసుడు అనే పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. తద్వారా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …
Read More »బాబుకు షాక్…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్బై…టీఆర్ఎస్లో చేరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవల జరిగిన …
Read More »మానవత్వాన్ని చాటుకున్న హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు..!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం …
Read More »లండన్ లో ఘనంగా ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ సంబరాలు
లండన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో ‘టీఆర్ఎస్ విజయోత్సవ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మరియు ప్రవాస బిడ్డలు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. …
Read More »పార్టీని అజేయ శక్తిగా మలుస్తా…కేటీఆర్
మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. …
Read More »