ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …
Read More »ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డు
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా …
Read More »సీఎం కేసీఆర్ కానుక-ఖాతాల్లోకి రూ.5వేలు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 471కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన సంగతి విదితమే.ఢిల్లీ మర్కజ్ సంఘటనతో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయిన సంగతి విదితమే. కరోనా నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపాలిటీ,వైద్య సిబ్బందిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి విదితమే.వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలో పది శాతం అదనంగా వేస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఏడున్నర వేలు ఇస్తామని అన్నారు.ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులకు …
Read More »మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా
మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీ పై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో బాగంగా సరిహద్దుల్లో సైనికుల వలె విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖా సిబ్బంది తో …
Read More »కరోనాను నిర్మూలించేందుకు లాక్డౌన్ను గౌరవించాలి
కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్డౌన్ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు లాక్డౌన్ను గౌరవించాలని కోరారు. ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకుండా …
Read More »రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
రైతులు పండించిన మక్కల కొనుగోలు లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి.పాలెం(రఘునాధపాలెం మండలం), అల్లీపురం(ఖమ్మం కార్పోరేషన్), లచ్చగూడెం (చింతకాని మండలం), పెద్ద గోపవరం(కొనిజర్ల మండలం) గ్రామాల్లో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …
Read More »కరోనా వ్యాధి నివారణకు మేము సైతమంటూ గ్రామ మహిళలు
కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని …
Read More »గత మార్చి బిల్లు కట్టండి చాలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్లైన్ ద్వారా కడితే సరిపోతుందని కస్టమర్లకు తెలియజేసింది. గత మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తాయని, దాని ప్రకారం ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే చాలని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …
Read More »మహిళా సర్పంచ్.. సిటిజెన్ హీరో
తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట్ మండలంలోని గోపతండాకు చెందిన మహిళా సర్పంచ్ అజ్మీరా లక్ష్మిని ‘సిటిజెన్ హీరో’గా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్న అజ్మీరా లక్ష్మి.. కరోనా వైరస్పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కొనియాడారు.
Read More »లాక్డౌన్ ఉండాల్సిందే!
రాష్ర్టానికి, దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో లేని మనలాంటి దేశానికి లాక్డౌన్ తప్ప గత్యంతరం లేదని స్పష్టంచేశారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల పరిస్థితి మనకు రాకూడదని ఆకాంక్షించారు. లాక్డౌన్ను సడలిస్తే.. పరిస్థితి చేజారిపోతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం కానీ …
Read More »