హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …
Read More »కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్చానల్ క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …
Read More »కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్ బీమా అందజేత
టీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పోతరాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడికి ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీశ్ నేడు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »జూన్ 8 నుంచి భక్తులకు దర్శనాలు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణలోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తుల దర్శనాలకు ఆలయాలు తెరిచే విషయమై శుక్రవారం అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్ఓపి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు …
Read More »తెలంగాణ మార్గదర్శి
దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది. పండిన పూటా పండగ చేసుకోలేని దండగమారి సేద్యం బడుగు రైతుల బతుకులతో మృత్యు క్రీడలాడటాన్ని ఓ రైతుగా అవలోకించి, ముఖ్యమంత్రిగా ఆలోచించి, అవరోధాల్ని అధిగమించి చేపట్టిన చర్యలు- దేశ ధాన్యాగారంగా తెలంగాణను సువ్యవస్థీకరించాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాంకేతిక అద్భుతమనదగ్గ ప్రాజెక్టులతో బీడు …
Read More »బహరేన్ దేశంలో తెలంగాణ యువకుడి మృతదేహం స్వగ్రామానికి తరలించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్
బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ . పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపు
సీజనల్ వ్యాధుల నివారణకోసం పురపాలకశాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ ను ఆదివారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. తన నివాసంలో ఉన్న పూల కుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలిగించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు పేరుకుపోయిందా అని పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారుల సలహామేరకు యాంటీ లార్వా మందులను చల్లారు. ప్రస్తుతం ప్రజలందరికీ ఆరోగ్యంపైన ప్రత్యేక స్పృహ …
Read More »కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు (యార్న్) అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే రెండేండ్లపాటు చేనేతవస్ర్తాలపై పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులను పరిశీలించాలని సూచించారు. లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత, టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర …
Read More »వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …
Read More »జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్
లాక్డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, ఫిట్నెస్ స్టూడియోలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే …
Read More »