దేశంలో మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో దేశంలో 150.23కోట్ల మొక్కలు నాటడం జరిగింది.. అందులో తెలంగాణ రాష్ట్రం లోనే 38.17కోట్లు నాటినట్లు తెలిపింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (34.54కోట్లు), ఉత్తరప్రదేశ్ (22.59కోట్లు) ఆంధ్రప్రదేశ్ (17.05కోట్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చంద్రశేఖర్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు. కేంద్రమంత్రి సుప్రియో సమాధానమిచ్చారు
Read More »జర్నలిస్టు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 260మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు. వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జలవిహార్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు.
Read More »రెండు కండ్లు ఒకే చూపు – తెలంగాణ ముద్దుబిడ్డలు పీవీ, కేసీఆర్
తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యాలు, నిర్వహించిన పదవులు వేరైనా ఇరువురి ఆలోచనల్లో, కార్యాచరణలో సారూప్యం ఉన్నది. ఇరువురి ఆకాంక్ష పేదల కన్నీరు తుడవడమే. వివిధ సందర్భాలలో ప్రధానిగా పీవీ ప్రసంగాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆచరణ గమనిస్తే, భావసారూప్యం ఎంతగా ఉందో తెలిసిపోతుంది. పీవీ ప్రధాని పదవి చేపట్టే …
Read More »పార్టీ మనకు అండగా నిలబడుతుంది-ఎమ్మెల్యే అరూరి…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46,47డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాల్ పూర్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ పాటిష్టానికి కార్యకర్తలే కీలకం. బలమైన పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు-మంత్రి హారీష్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక …
Read More »జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ లేనిదే టీకాంగ్రెస్, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …
Read More »వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవీ సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్తో పాటు పలువురు …
Read More »తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఆధార్ నంబర్ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నంబర్ కనిపించకపోవటం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు వారి సమస్యల పరిష్కారం అవడం కోసం మీసేవ ద్వారా అప్ప్లై చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలి. …
Read More »తెలంగాణలో రేపు ప్రత్యేక సెలవు డే
తెలంగాణ రాష్ట్రంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2010, ఆగస్టు 4న జారీ చేసిన జీవో 433ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది
Read More »కేంద్రం ఏమిచేసిందో బీజేపీ సన్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్
‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ …
Read More »