తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం-మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా హార్వెస్టర్లు, ఇన్నోవర్స్, రీపర్ల వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకు 6,66,221 మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 951 కోట్ల 28 లక్షలు ఖర్చు చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి కార్యాచరణ ప్రక్రియ …
Read More »ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్-మంత్రి హరీశ్ రావు.
ఉద్యోగుల సంక్షేమాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ప్రభుత్వం తమదని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన ఫిట్ మెంట్ ను ఇస్తూ పీఆర్సీపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పీఆర్పీని ఆహ్వానిస్తూ అరణ్య భవన్ లో ఉద్యోగుల సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ పక్షపాతి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది గల వ్యక్తని చెప్పారు. ప్రభుత్వ …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో గాజు పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో మరో పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది ప్రముఖ పారిశ్రామిక సంస్థ హెచ్ఎస్ఐఎల్ గ్రూప్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని భువనగిరిలో రూ.230 కోట్లతో గాజు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో వెల్లడించారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సందీప్ సోమానీ తనకు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 700 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. హెచ్ఎస్ఎల్ గ్రూప్ రాష్ట్రంలో ఏడోసారి పెట్టుబడి పెట్టేందుకు …
Read More »శభాష్ కేటీఆర్ – అందరూ ఫిదా
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ …
Read More »టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం …
Read More »గోదావరి జలాలు.. విడుదల చేసిన మంత్రి హరీశ్రావు
తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు …
Read More »నర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు త్వరలోనే భూసేకరణ
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూములను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట గ్రామంలోని సర్వే నంబర్ 813లోని ప్రభుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎకరాల 29 గుంటల భూమిని గుర్తించామన్నారు. …
Read More »