ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంక్లు, మీడియాకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ …
Read More »దమ్ముంటే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బండి సంజయ్ను సూటిగా అడుగుతున్నా.. ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా? మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయం చేయడం సరికాదు. దమ్ముంటే అభివృద్ధిలో తమతో పోటీ …
Read More »తెలంగాణలో నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన …
Read More »టీఆర్ఎస్ లో చేరిన యువకులు..
వరంగల్ శివనగర్ కి చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్ తో కలిసి టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్,టీఆర్ఎస్ నాయకుడు పగడాల సతీష్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాద్యమన్నారు.టీఆర్ఎస్ పాలనలో …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు …
Read More »టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముషీరాబాద్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, హెచ్ఎంఎస్ కార్మిక సంఘం నాయకుడు బల్లవీరస్వామి(75) అనారోగ్యంతో తన నివాసంలో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియానవీన్గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భక్తియార్, నాయకులు వీరస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబానికి …
Read More »కరోనా వాక్సిన్ తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న సదుపాయాలు, టీకా సరఫరాలపై అధికారులతో చర్చించి నిరంతరం …
Read More »ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్టాండ్ వద్ద మహిళా సంఘ …
Read More »ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల
కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్ మొదలైందని అన్నారు. సెకండ్ వేవ్లో వైరస్ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 …
Read More »