అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి మాత్రమే మా ఎజెండా అని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మునుగోడు మండల కేంద్రంలో రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజల ఆకలి తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్.. అద్భుతమైన …
Read More »తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగా బిల్లులు సమర్పించిన ఆయాశాఖలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో జూన్ నెల బకాయిలను ట్రెజరీ అధికారులు జమచేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్యోగులందరికీ జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల జూన్ నెలలో పెరిగిన వేతనాలు జమకాలేదు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆయాశాఖలకు చెందిన అధికారులు ఉద్యోగుల బిల్లులుచేసి …
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ,శోభమ్మ ఉన్న పంచలోహ చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత,శ్రీహర్శిత లతో కల్సి బహుకరించారు. ఈ …
Read More »మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు
మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా హాబీ టేషన్లలలో క్షేత్రస్థాయిలో సమస్యల వల్ల మిషన్ భగీరథ నీరు చేర లేదన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.అన్ని …
Read More »హుజరాబాద్ నియోజకవర్గంలో TRSదే గెలుపు-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
హుజరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజహిద్ హుస్సేన్ తదితరులు హైదరబాద్ లోని బంజారాహిల్స్ ఉన్న హోం మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మసీదుల నిర్మాణం విషయంలో వారు వినతి పత్రాన్ని హోం మంత్రి కి సమర్పించారు. ఈ సందర్భంగా …
Read More »వచ్చేనెల 1 నుంచి కార్యకర్తలకు జీవితబీమా
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు వచ్చేనెల 1 నుంచి జీవిత బీమా అమలు కాబోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా 61లక్షల సభ్యత్వం చేయించటం ఒక ఎత్తు అయితే సభ్యత్వ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయటం మరో ఎత్తు అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం పార్టీ ప్రధాన …
Read More »మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి షాక్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన …
Read More »టీఆర్ఎస్లోకి వలసల పర్వం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కౌటాల మ౦డల౦లోని గురుడుపేట గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో …
Read More »నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి…..
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు (225), వర్ధన్నపేట (604), పర్వతగిరి (452) మండలాల లబ్దిదారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి …
Read More »కొత్త రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్కార్డులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో …
Read More »