Home / Tag Archives: kcr (page 265)

Tag Archives: kcr

వెనక్కి తగ్గిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయుదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.  మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో …

Read More »

తెలంగాణలో ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు

తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది …

Read More »

జంటనగరాల్లో వైభవంగా బోనాల వేడుకలు

జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్‌ ఉధృతి కాస్త …

Read More »

సీఎం కేసీఆర్‌ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు

సీఎం కేసీఆర్‌ పాలనలో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలు పడ్డాయని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాంయాదవ్‌ అన్నారు. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలోనే యాదవులకు మంచి రోజులు వచ్చాయన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌ మండలం అంబాలలో యాదవ మహాసభ గ్రామ అధ్యక్షుడు బోయిని చంద్రమౌళితోపాటు కమిటీ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ఈ ప్రతిని శనివారం …

Read More »

పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు

పత్తి అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిన్న మొన్నటి వరకు ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌ను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా పత్తి అమ్మకాల్లో తెలంగాణ నంబర్‌ 1గా నిలిచింది. ఒక్క మన రాష్ట్రం నుంచే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఏకంగా 1.78 కోట్ల క్వింటాళ్ల (178.55 లక్షల క్వింటాళ్లు) పత్తిని కొనుగోలు చేయటం గమనార్హం. దేశంలో ఇదే అత్యధికమని సీసీఐ ప్రకటించింది. …

Read More »

ధరణి పోర్టల్‌ కొత్త రికార్డులు

ధరణి పోర్టల్‌ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. పోర్టల్‌ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష రిజిస్ట్రేషన్ల మార్క్‌ను అధిగమించింది. జూలైలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు లక్షకుపైగా జరిగాయి. స్లాట్‌ బుకింగ్స్‌లోనూ జూలై టాప్‌లో నిలిచింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ & మ్యుటేషన్‌, భాగ పంపకం (పార్టిషన్‌), వారసత్వం (సక్సెషన్‌) కలిపి 1.08 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. నవంబర్‌ 2న ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. పెండింగ్‌ మ్యుటేషన్లు (11,295), …

Read More »

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొగడ్తల వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పథకంపై దళిత వర్గాలు, ప్రజా, కుల సంఘాలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పథకం బాగున్నదని ఇప్పటికే సీపీఐ, సీపీఎం ప్రశంసించగా, తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఈ పథకాన్ని స్వాగతించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒకసారి మాట అన్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లరని, ఆ …

Read More »

అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్లానింగ్ అమలు చేయాలన్నారు. ఒక పథకం ప్రారంభించామంటే.. దాని ఫలితం, ప్రతిఫలం, భవిష్యత్ ఫలాలు ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి అవుందన్నారు.‘‘హైదరాబాద్ లో గీత కార్మికుల పొట్టగొట్టి కల్లు దుకాణాలు బంద్ …

Read More »

దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదు

దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోైట్లెనా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ …

Read More »

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రూ.200 కోట్లతో వంతెన

 హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు కొనసాగింపుగా వంతెన నిర్మాణంపై అడుగులు పడుతున్నాయి. రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్మశానవాటిక నుంచి రామంతాపూర్‌ వైపున్న మోడ్రన్‌ బేకరీ వరకు వంతెన నిర్మించనున్నారు. ఈ పనుల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా, తాజాగా మూడు సంస్థలు బిడ్‌ దాఖలు చేశాయని ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు తెలిపారు. బిడ్‌ల పరిశీలన జరుగుతోందని, నిర్మాణ సంస్థ ఎంపిక త్వరలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat