Home / Tag Archives: kcr (page 264)

Tag Archives: kcr

సీఎం కేసీఆర్‌ ప్రశ్నకు జవాబేది?

‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్‌లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంలో, ఒకవేళ ఎన్నికల ప్రయోజనానికి ఒక చర్య తీసుకుంటే తప్పేమిటనే మౌలికమైన ప్రశ్నను కేసీఆర్‌ లేవనెత్తుతున్నారు. ఇందుకెవరూ జవాబివ్వటం లేదు. ఇది ఎప్పటికైనా చర్చించవలసిన ప్రశ్నే. దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి …

Read More »

మంత్రి ఎర్రబెల్లితో నిర్మాత అల్లు అరవింద్ భేటీ

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల …

Read More »

మాజీ మంత్రి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చుర‌క‌లంటించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై హాలియాలో స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా జానారెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏర్ప‌డిన తొలినాళ్ల‌లో.. శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు జానారెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు. 2 ఏండ్ల‌లో క‌రెంట్ వ్య‌వ‌స్థ‌ను మంచిగా చేసి.. 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇస్తామ‌ని చెప్పితే జానారెడ్డి ఎగ‌తాళి చేసిండు. రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి …

Read More »

ఆంధ్రా వాళ్లు చేస్తున్నది దాదాగిరీ

కృష్ణా జ‌లాల వివాదంపై నాగార్జున సాగ‌ర్ వేదిక‌గా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభించే తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా న‌దిపై ఏ విధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది …

Read More »

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఇచ్చిన హామీల‌ను త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అద్భుత‌మైన విజ‌యాన్నిచ్చి ముందుకు న‌డిపించినందుకు …

Read More »

హాలి‌యాకు చేరుకున్న‌ సీఎం కేసీ‌ఆర్‌

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ నియో‌జ‌క‌వర్గ కేంద్రం హాలి‌యాకు సీఎం కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చేరుకున్నారు. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేసీఆర్ సాగ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా టీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. హాలియా మార్కె‌ట్‌‌యా‌ర్డులో ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రు‌లతో లిఫ్ట్‌ పథ‌కాల పనుల పురో‌గ‌తిపై కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యంగా నెల్లి‌కల్‌, ఇతర …

Read More »

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బి.శ్రీనివా‌స్‌రెడ్డి(55) గుండెపోటుతో మృతి

 మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బి.శ్రీనివా‌స్‌రెడ్డి(55) గుండెపోటుతో మృతి చెందాడు. కోకాపేటలో ఉంటున్న ఆయనకు శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. మంత్రి సబితారెడ్డి ఆదివారం శ్రీనివా‌స్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికాలో ఉన్న శ్రీనివా్‌సరెడ్డి కుమార్తె వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Read More »

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …

Read More »

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్‌కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ ఆమోదం తెలిపాక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్‌ సమక్షంలో …

Read More »

ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు

దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat