తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలు, దవాఖానల్లో వసతులు, ఆక్సిజన్, మందుల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆసుపత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులపై మంత్రిమండలి చర్చించనున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల …
Read More »హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో కండక్టర్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. హన్మకొండ-చెన్నూరు RTC బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కండక్టర్.. ప్రయాణికులు దిగాక డ్రైవర్ తో కలిసి టీ తాగారు. ఆ దగ్గర్లోనే ఉన్న కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం చూసి.. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ తేలగా.. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
Read More »సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు.. నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి తెలిపారు.
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »తెలంగాణలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల కరోనా డోసుల పంపిణీ పూర్తైనట్లు వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ప్రజల స్ఫూర్తి, వైద్య సిబ్బంది అంకితభావం వల్లే ఈ ఘనత సాధించామన్న ఆయన.. అనేక ఆటంకాలు దాటి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిద్దామన్న హరీశ్.. 15-18 ఏళ్ల మధ్య వయసు వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »తెలంగాణలో 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.
Read More »నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
Read More »నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »