తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. బస్టాండ్లలో ఫార్మసీ సేవలు తీసుకురావాలని నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని తీర్మానించారు.
Read More »బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎ్సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్లతో కలిసి ఆయన …
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కి అరుదైన గౌరవం….
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ… ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ… ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక …
Read More »మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, …
Read More »ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్
జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను ప్రారంభించి, రంజాన్ పర్వదినాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లిం సోదరులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముస్లిం సోదరులకు ఇచ్చిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ …
Read More »దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో తెలంగాణ
దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ఐటీ రంగం కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఉన్న 20కి …
Read More »బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం
హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …
Read More »దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ చేసి చూపించారు: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More »రేవంత్ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి
రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ …
Read More »హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్)లో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీనగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897)లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా.. కొత్తవాటితో HYDకు నలువైపులా నాలుగు టిమ్స్ు అందుబాటులోకి రానున్నాయి.
Read More »