డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …
Read More »తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Read More »సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష
అమెరికాలోని మేరీల్యాండ్లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …
Read More »తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆన్లైన్లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ ఫ్రెష్టుహోమ్ (ఎఫ్టీహెచ్).. ప్రకటించింది. ఈ క్రమంలో రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఈ-కామర్స్ వేదికగా ఎఫ్టీహెచ్ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు …
Read More »రేపే TRS ఎంపీలు పదవీ బాధ్యతలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కార్యాలయంలో నూతన ఎంపీల చేత రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్ మద్దతు ఆయనకేనా!
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతిస్తారని శరద్ పవార్ చెప్పారు. ముంబయిలో …
Read More »తెలంగాణలో మండలానికి రెండు మాడల్ స్కూళ్లు
తెలంగాణలో సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో మండలాన్ని ఒక యూనిట్గా చేసుకొని పనులను ఇంజినీరింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. మండలానికి రెండు చొప్పున మాడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 594 మండలాల్లో 1,188 స్కూళ్లను జూన్ 30 నాటికి సిద్ధం చేయాలని గడువుగా విధించారు. మిగతా 7,935 బడుల్లోనూ పనులు …
Read More »శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగులు, …
Read More »అగ్నిపథ్ పై మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్ స్కీమ్ను ప్రకటించరా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ …
Read More »