తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »MLC గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్ అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని, ఈ క్రమంలోనే నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కవిత ఏకగ్రీవంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ …
Read More »ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …
Read More »ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిసిన యూవీకెన్ సంస్థ ప్రతినిధులు!!
నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లో యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. యూవీకెన్ సంస్థ ప్రతినిధులు,ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాద్ లోని నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు.యూవికెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు…
Read More »తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను శాలువతో సత్కరించిన ఎమ్మెల్సీ కవిత
ఇటీవల నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ,ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More »ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’
ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …
Read More »కరోనా కష్ట కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ
కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …
Read More »