తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »ఆటా అంటే ఆంధ్ర -తెలంగాణ అసోసియేషన్
అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన …
Read More »అగ్నిపథ్ తో దేశభద్రతకు ముప్పు: Mp ఉత్తమ్ కుమార్
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో దళితబంధు కింద 43 మందికి ట్రాక్టర్లు, ఐదుగురికి కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట వేసిందన్నారు. ఐనోల్ గ్రామంలో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్గా అప్గ్రేడ్ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ …
Read More »ఫాదర్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్
ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు. Happy Father’s Day to the best Dad …
Read More »బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం : ఎమ్మెల్సీ కవిత
నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. …
Read More »దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబివ్వండి..?- బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ కవిత సవాల్
ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని ఆమె సవాల్ చేశారు. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చే …
Read More »అర్వింద్.. పసుపు బోర్డు ఏదీ?.. ఇంకెన్నాళ్లు మాయమాటలు?: కవిత
అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల క్రితం పసుపు …
Read More »సీఎం కేసీఆర్ను కలిసిన ఏపీ మంత్రి రోజా
తెలంగాణ సీఎం కేసీఆర్ను ఏపీ మంత్రి ఆర్కే రోజా కలిశారు. తన కుటుంబంతో కలిసి ప్రగతిభవన్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్కు ఆయన ఫొటో ఫ్రేమ్ను జ్ఞాపికగా రోజా అందజేశారు. అంతకుముందు రోజాకు సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. భర్త సెల్వమణి, కుమార్తె, కుమారుడితో కలిసి …
Read More »