Home / Tag Archives: janasena (page 8)

Tag Archives: janasena

నియోజకవర్గాల పునర్విభజనపై మోదీ సర్కారు క్లారిటీ

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం 2026 సంవత్సరం అనంతరం జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన జరపవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉండదని ఆయన స్పష్టం …

Read More »

మార్చి 29న ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభ

ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం  42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల …

Read More »

ఏపీ మండలిలో బలం పెంచుకున్న వైసీపీ

ఏపీలో నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు స్థానాలు.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో  శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ బలం భారీగా పెరిగి 44కు(గవర్నర్ కోటాతో కలిపి) చేరనుంది. ప్రధానప్రతిపక్షమైన టీడీపీ సభ్యుల సంఖ్య 17 …

Read More »

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు- ఓటు హక్కు వినియోగించుకున్న 130 మంది ఎమ్మెల్యేలు

ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ హాలులో కొనసాగుతోంది. వైసీపీ అధినేత.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం సహా ఇప్పటి వరకు 130 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మరోవైపు ప్రధానప్రతిపక్షమైన టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాసేపట్లో ఓటు వేయనున్నారు. మొత్తం 7 ఎమ్మెల్సీల స్థానాలకు …

Read More »

వైసీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే

 ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు   వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ …

Read More »

వైసీపీకి చుక్కలు చూపిస్తాం -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్   తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్   జగన్   దొంగ హామీలు ఇచ్చారు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక  ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి …

Read More »

రెండోరోజు సభ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీకి నిన్న శుక్రవారం వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై  చర్చకు పట్టుబడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందిగా మారిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ …

Read More »

రూ.2,28,540 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం …

Read More »

అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన శాసనసభ్యులు అడ్డుతగులుతున్నారు. తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగులుతుండటంతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, బాలకృష్ణ, అశోక్ తదితర టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు …

Read More »

ఢిల్లీకి సీఎం జగన్

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఆంధ్రప్రదేశ్ సీఎం .. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు   ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి జగన్ రేపు శుక్రవారం  ప్రధానమంత్రి నరేందర్ మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat