జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్.. అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Read More »బీసీ గురుకులాలకు రూ.82.84 కోట్లు విడుదల
తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం రూ.82.84 కోట్లు విడుదల చేసింది. 2021-22 రెండవ త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోనీ హైస్కూల్, జూనియర్ కాలేజీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తారు. 2021-22 బడ్జెట్లో సొసైటీకి ప్రభుత్వం రూ.165.68 కోట్లు కేటాయించిన విషయం …
Read More »లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తనదైన ముద్ర
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తనదైన ముద్రతో పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈ రంగంలోకి ఇప్పటికి రూ.6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలతో పాటు భవిష్యత్తులో రాబోయే కంపెనీలు కూడా తోడయితే మొత్తం 215 కంపెనీలు అవుతాయని ఆయన తెలిపారు. బయో ఆసియా 2022 సదస్సును ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. లైఫ్ సైన్స్ కంపెనీలు …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్ వన్ …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ పంచ్లు
తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం అయినా ఉంటుందా..? అది కూడా లేదు. అయినప్పటికీ ఇండియాలోనే యంగెస్ట్ స్టేట్ అయినా తెలంగాణ మాత్రం.. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ …
Read More »మంత్రి హరీశ్రావు డైనమిక్ లీడర్- సీఎం కేసీఆర్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకింత చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలిలో కట్టడం సాధ్యం కాదు. భూమ్మీదనే కట్టాలి. ముంపునకు గురైన గ్రామాలకు న్యాయం చేస్తాం. భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం. చరిత్రలో ఇప్పటి …
Read More »మల్లన్నసాగర్ ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ జలకిరీటం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు …
Read More »మల్లన్నసిగలో గంగమ్మ తాండవం
తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు …
Read More »జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ఖేడ్ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందామన్నారు. నారాయణ్ఖేడ్లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తానని తెలిపారు. నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. పని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ …
Read More »సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం
పురాణాల్లో రాముడు ఎక్కడ కాలు పెడితే అక్కడ రాయి అహల్య అయిందని.. నేడు సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం అవుతోందని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జిల్లాలోని నారాయణ్ఖేడ్లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్ఖేడ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు …
Read More »