ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ హెలికాప్టర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్ అయింది. కాగా హెలికాప్టర్ ఒడిశాలోని గోపాల్పూర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »