తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »వరద నష్టం రూ.5వేల కోట్లు
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …
Read More »వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు …
Read More »వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, …
Read More »క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది
క్రిస్టియన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలోని తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి సంబంధించిన నమూనాను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం గండిపేట సమీపాన కోకాపేటలో రెండెకరాల స్థలాన్ని,10కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. నమూనాను పరిశీలించిన మంత్రి అందులో పలు …
Read More »అండగా ఉంటాం.. ఆధైర్యపడకండి-మంత్రి కేటీఆర్
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »హైదరాబాద్లో హైఅలర్ట్.. రోడ్లు మూసివేత
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. -ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ – కోఠి రోడ్లు మూసివేత -బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు -కాచిగూడ రైల్వేష్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు -నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్నది. చాదర్ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్దలపైకి చేరారు. చాదర్ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్సుఖ్నగర్కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వరద ఉధృతిలో అంబర్పేట-దిల్సుఖ్నగర్ దారిలో …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించాలి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలను కోరారు. నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »