తెలంగాణలో నిన్న 31,486 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇందులో 4,005 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,542 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,581 కరోనా మరణాలుసంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 75,15,066 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
Read More »టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాజ్ భవన్ ఘెరావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను పోలీసులు నిలువరించారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లుంబినీ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోన్నారు. దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. సంపత్ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Read More »కవులు,రచయితలను గుర్తించిందే సీఎం కేసీఆర్
కవులు, రచయితలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 25 ఏండ్లలో కవులను, రచయితలను ఎవరూ గుర్తించలేదని, తన పాట, కవిత, రచనలను గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. హైదరాబాద్లోని మలక్పేట ‘బీ’ బ్లాక్ ముంతాజ్ కళాశాలలో ప్రిన్సిపాల్, కవి యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2020 (షేక్ మహమ్మద్ మియా, కేఎల్ …
Read More »సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(CDS) భవనాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో …
Read More »హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read More »ఎల్బీనగర్లో జంట రిజర్వాయర్లు ప్రారంభం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. హడ్కో నిధులు రూ. 325 కోట్లతో …
Read More »గ్రేటర్లో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దోమలగూడలో జోనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పనులకు, నారాయణగూడలో మోడ్రన్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ మేయర్ …
Read More »గ్రేటర్ హైదరాబాదీలకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం 60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ …
Read More »వికారాబాద్లో ఘోరం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు మృతిచెందారు. మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు …
Read More »రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సీపీ సజ్జనార్
బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి …
Read More »