బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.
Read More »వాముతో ఎన్నో ప్రయోజనాలు
వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
Read More »గ్రీన్ టీ తాగుతున్నారా మీరు..?
బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. అయితే ఎన్నిసార్లు తాగుతున్నారనేదే పాయింట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు కెఫిన్ కూడా ఉంటుంది. అందుకే రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని పోషక విలువలు ద్రవాల రూపంలో బయటికి వెళ్తాయి. భోజన సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అధిక …
Read More »పనసతో బోలెడు లాభాలు
పనసతో బోలెడు లాభాలు పనస కాయలో పీచు పదార్థాలు ఎక్కువ. అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులు,ఎముకల బలహీనతను నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ నరాల రుగ్మతలను నివారిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది పనస.
Read More »కరోనా థర్డ్ వేవ్ తప్పదా..?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్-IMA.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల అమలుపై నిర్లక్ష్యం తగదని సూచించింది. ఇలాంటి ఘటనలే థర్డ్ వేవ్కు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అంశంపై మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని సూచించింది.
Read More »ఆహారం నమలకుండా తింటే ఏంటి నష్టం..?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా …
Read More »నాలుగు నీటి సూత్రాలు మీకోసం
గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది. టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.
Read More »రోగ నిరోధకశక్తి పెరగాలంటే?
విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.
Read More »నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?
నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …
Read More »షుగర్ అదుపులో ఉండాలంటే
షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?… * రోజూ కాసేపు వాకింగ్ చేయాలి * ఎక్కువ నీళ్లు తాగాలి * కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి * తులసి ఆకులను తినాలి * రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి * ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి * కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన గింజలను తినాలి
Read More »