తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Read More »కన్నుల పండుగగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల …
Read More »సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హారీష్ రావు
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎక్స్అఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాప్రతినిథులు మాత్రమే ఓటర్లు కావడంతో 99 శాతం ఓట్లు నమోదవుతాయని తెలిపారు. …
Read More »కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయి
కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా …
Read More »వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హారీష్ రావు Fire
తెలంగాణలో రైతన్నలు పండించే యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. వరి కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, కిషన్రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Read More »ఖర్జూరతో లాభాలెన్నో…
1. చలికాలంలో ఖర్జూర తింటే శరీరం వెచ్చగా ఉండేందుకు అవసరమైన వేడిని అందిస్తుంది. 2. ఐరన్ దండిగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుంది. హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. 3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. 4. ఎక్కువ జిమ్ చేసే వారు బాదం జీడిపప్పుతో పాటు ఖర్జూర తినొచ్చు. 5. చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చర్మం నిగనిగలాడుతుంది.
Read More »ఆరెంజ్ జ్యూస్ ఇలా తాగుతున్నారా..?
నారింజ రసంలో విటమిన్-సితోపాటు హెస్పెరిడిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే రసాయన ప్రక్రియను అడ్డుకునే శక్తి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆరెంజ్ జ్యూస్లో చాలామంది చక్కెర లేదా ఉప్పు కలుపుకొని తాగుతారు. అలా చేయడం వల్ల జ్యూస్ తన సహజ స్వభావం కోల్పోయి శరీరానికి పోషకాలు అందించడంపై ప్రభావం పడుతుందని ఫ్లోరిడా యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు.
Read More »మలేరియా వ్యాక్సిన్కు WHO ఆమోదం
పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ (ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01) కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇది సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …
Read More »క్యాన్సర్ రాకుండాలంటే ఉండాలంటే..?
ప్రపంచానికి సవాల్ విసురుతున్న క్యాన్సర్కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. అయితే క్యాన్సర్ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్ రోజ్ డే (క్యాన్సర్ బాధితుల సాంత్వన …
Read More »