తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ …
Read More »డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!
పట్టాదార్ పాస్పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది . వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు …
Read More »60,000 మంది జీవితాలను మార్చే మరో అద్భుత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాలను మార్చే నిర్ణయం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేపట్టడం …
Read More »ఫలించిన ప్రభుత్వ ఒత్తిడి..హైదరాబాద్కు విమానంలో నోట్లు
నోట్ల కష్టాలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్బీఐ నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలో నోట్ల కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐని వివరణ కోరింది. ఈ సందర్భంగా …
Read More »సీఎం కేసీఆర్ పథకానికి ఇంకో రాష్ట్రం ఫిదా..!!
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో రాష్ట్రం మన సర్కారు పథకానికి ఫిదా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ …
Read More »తెలంగాణలో ఇక అవినీతికి,జాప్యానికి తావు లేని రిజిస్ట్రేషన్ విధానం..!!
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం, ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్ సైట్ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా …
Read More »కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..!
కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..! అవును.. కాంట్రాక్టు లెక్చరర్లకు టీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఏప్రిల్ నెల నుంచి యూనివర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు దాదాపు 75 శాతం వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇవాళ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఆ జీవోను మంత్రి కడియం కాంట్రాక్టు ఉద్యోగులకు అందజేశారు. జీతాలు పెంచుతూ జారీ చేసిన జీవోను అందుకున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఈ సందర్భంగా …
Read More »కార్మికుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి నాయిని
దేశంలోనే కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలిచిందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన జాతీయ సమావేశంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, …
Read More »