ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన …
Read More »ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టాం
హైదరాబాద్లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ . 19వందల 46కోట్ల 90లక్షలతో 22 పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 లక్షల వ్యయంతో 24 పనులు …
Read More »రానున్న 4 నుంచి 5 గంటల్లో హైదరాబాద్ అతిభారీ వర్షం
గులాబ్ తుఫాను త్రీవ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీసింది. త్రీవవాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో …
Read More »అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం
ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్బండ్పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్లో పోస్టు చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్సాగర్లో లేజర్ షో …
Read More »హైదరాబాద్.. తయారీ హబ్
తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్లకు హబ్గా హైదరాబాద్ ఎదిగింది. ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్, రక్షణ, ఈఎస్డీఎం, మెడికల్ డివైజెస్ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును …
Read More »రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు
హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Read More »మూసీ నదికి కొత్త వన్నె
ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా ముస్తాబైంది. నాగోల్ పరిధిలో మూసీ నదిని రమణీయంగా తీర్చిదిద్దారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాకలను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగస్టు రోజున ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ …
Read More »