పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు (225), వర్ధన్నపేట (604), పర్వతగిరి (452) మండలాల లబ్దిదారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి …
Read More »సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజలకు సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా …
Read More »బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి
కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు మరియు 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు అనంతరం టీ-సెర్ఫ్ 2020-21ఆర్ధిక సంవత్సరంలో 118 స్వశక్తి సంఘాలకు …
Read More »తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి
గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్లైన్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్, ఆర్థిక, పంచాయతీరాజ్ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ఆడిట్పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్లైన్ …
Read More »అధికారులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామాల్లో నిద్రచేసి అక్కడికక్కడే పరిష్కరించాలని పంచాయతీరాజ్శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. పల్లెప్రగతి విజయవంతానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బుధవారం వరంగల్ నుంచి పల్లెప్రగతిపై అదనపు కలెక్టర్లు, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తప్పనిసరిగా నెలలో కొన్నిరోజులు పల్లెల్లో నిద్రచేయాలని, గ్రామంలో పర్యటించి పరిశుభ్రత, గ్రీనరీ ఇతర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని …
Read More »పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముగిసిన సీఎం KCR సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ద్యేయం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలంగాణలో హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో చేరనున్నట్టు సమాచారం …
Read More »ప్రైవేట్ ఫీజులపై పర్యవేక్షణ : మంత్రి ఎర్రబెల్లి
కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు …
Read More »మరోసారి గ్రేటర్ వరంగల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం….
గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 1&2వ డివిజన్ గుండ్లసింగారం, పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాలలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 1&2వ డివిజన్ అభ్యర్థులు గణిపాక కల్పన, బానోత్ కల్పన గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ …
Read More »