దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్-IMA.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. సామూహిక కార్యక్రమాల్లో కొవిడ్ నిబంధనల అమలుపై నిర్లక్ష్యం తగదని సూచించింది. ఇలాంటి ఘటనలే థర్డ్ వేవ్కు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యాటక స్థలాల సందర్శన, తీర్థయాత్రలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అంశంపై మరికొన్ని నెలలు ఆగాల్సిన అవసరం ఉందని సూచించింది.
Read More »కడుపు వికారంగా ఉందా..?
కడుపు వికారంగా ఉంటే, ఇలా చేయండి జీలకర్రను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలుపుకుని తాగాలి కాఫీ, టీ, పాలను తీసుకోకపోవడమే మంచిది తులసి ఆకుల రసం తీసుకోవాలి పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.
Read More »ఆహారం నమలకుండా తింటే ఏంటి నష్టం..?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా …
Read More »నాలుగు నీటి సూత్రాలు మీకోసం
గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది. టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.
Read More »రోగ నిరోధకశక్తి పెరగాలంటే?
విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.
Read More »నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?
నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …
Read More »షుగర్ అదుపులో ఉండాలంటే
షుగర్ అదుపులో ఉండాలంటే ఏమి ఏమి చేయాలో తెలుసా..?… * రోజూ కాసేపు వాకింగ్ చేయాలి * ఎక్కువ నీళ్లు తాగాలి * కాకరకాయ ముక్కలను నీటిలో మరిగించి తాగాలి * తులసి ఆకులను తినాలి * రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి * ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి * కాఫీ, టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన గింజలను తినాలి
Read More »క్యారెట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
క్యారెట్ తో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కంటిచూపు మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు పొడిబారదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది.
Read More »కాకరకాయతో ఆరోగ్యం
కాకరకాయతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఉపయోగాలు ఏంటొ తెలుస్కుందాం కాకరకాయను క్రమం తప్పకుండా తింటే మలబద్ధకం, కడుపు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు తగ్గుతాయి. కాకర రసం తాగితే హ్యాంగోవర్ నుంచి బయటపడి, చురుగ్గా ఉంటారు.
Read More »ఆరోగ్య చిట్కాలు మీకోసం
*ఉల్లిపాయలను అరగంట నీళ్లలో ఉంచి కోస్తే కళ్లు మండవు. * కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ పోవాలంటే కీరదోస ముక్కలను మూసిన కనురెప్పలపై కాసేపు ఉంచితే ప్రయోజనం కల్గుతుంది. * రాగి వస్తువులను చింతపండుతో తోమితే మెరుస్తాయి. * ఇత్తడి చెంబులు, బిందెలు ముందు ఉప్పు నీటితో తోమి తర్వాత మామూలుగా తోమితే తళతళలాడుతాయి. * మంచి గంధం లేదా కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి.
Read More »