తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చేతిపై ఉన్న టాటూను చూసి నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు.
Read More »పెళ్ళి ఇంట విషాదం
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన రాజయ్య.. ఈ నెల 25న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో తన కూతురి వివాహం …
Read More »పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి
పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »బుల్లెట్ కలకలం కేసు- విచారణకు హాజరైన పరిటాల సిద్ధార్థ్
మూడు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టులో శ్రీనగర్ వెళుతున్న ప్రయాణికుడి బ్యాగులో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఓ బుల్లెట్ను గుర్తించారు. దీంతో విచారణ నిమిత్తం బుల్లెట్ను, సదరు ప్రయాణికుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు పరిటాల సిద్ధార్థ్. ఇతడి బ్యాగులోనే బుల్లెట్ లభించింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు 41 సీఆర్పీసీ కింద సిద్ధార్థ్ కు నోటీసులు అందజేశారు. లైసెన్స్ …
Read More »యూపీలో దారుణం – మహిళా రోగిపై దవాఖాన సిబ్బంది లైంగిక దాడి
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మీరట్ జిల్లాలోని బోధనాస్పత్రిలో మహిళా మానసిక రోగిపై అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని మీరట్ మెడికల్ కాలేజ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహిళ మానసిక పరిస్ధితి సజావుగా లేకపోవడంతో తల్లితండ్రులు 2017లో ఆమెను దవాఖానలో విడిచిపెట్టి వెళ్లారు. నిందితుడు దవాఖానలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ …
Read More »లాడ్జి అంటే.. చెప్పుతో కొడ్తా
లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్కుమార్పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్ పెట్టిన. …
Read More »తీన్మార్ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?
చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్స్ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీస్స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా …
Read More »తీన్మార్ మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు
తీన్మార్ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్ 197/2021లో ఐపీసీ సెక్షన్ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్పీసీ సెక్షన్ …
Read More »రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సోమాజిగూడలో ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హోటల్లోని రెండు గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆ హోటల్పై దాడి చేసి ఐదుగురు యువతులను, ఈ దందా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ …
Read More »